Pran Pratishtha Guests: రామమందిర మహోత్సవానికి వచ్చే అతిథులకు ఇచ్చే బహుమతులు ఇవే.. !
- By Gopichand Published Date - 08:16 AM, Sat - 13 January 24
Pran Pratishtha Guests: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి 11 వేల మందికి పైగా అతిథులు (Pran Pratishtha Guests) హాజరయ్యే అవకాశం ఉంది. పిటిఐ కథనం ప్రకారం.. కార్యక్రమానికి ఆహ్వానించబడిన వ్యక్తులకు ఆలయ సముదాయం మట్టిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పునాది తవ్వకంలో బయటకు తీసిన రామజన్మభూమి మట్టిని బాక్సుల్లో ప్యాక్ చేసి జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు అందజేస్తారు. ఆలయ ట్రస్ట్ శుక్రవారం (జనవరి 12) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
15 అడుగుల ఎత్తైన రామ మందిర చిత్రాన్ని ప్రధాని మోదీ పొందనున్నారు
రామ మందిరపు 15 మీటర్ల ఫోటోను జూట్ బ్యాగ్లో ప్యాక్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 11 వేల మందికి పైగా అతిథులు, ఆహ్వానితులకు చిరస్మరణీయ బహుమతులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు. రామజన్మభూమి మట్టితో పాటు దేశీ నెయ్యితో తయారు చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డూలను కూడా అతిథులకు ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు.
Also Read: Hanuman : హనుమాన్ హిట్ టాక్ తో ఆ డైరెక్టర్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
భక్తులకు కూడా మోతీచూర్ లడ్డూలు
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే రామభక్తులకు మోతీచూర్ లడ్డూ ప్రసాదాన్ని దేవ్రహ బాబా పంపిణీ చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారు చేసి టిఫిన్లో ప్యాక్ చేస్తున్నారు. దేవ్రహ బాబా శిష్యుడు ఇలా చెప్పాడు. ఇది స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన లడ్డూ, ఇందులో ఒక్క నీటి చుక్క కూడా ఉపయోగించబడలేదు. ఇది 6 నెలల వరకు చెడిపోదు అని పేర్కొన్నాడు.
44 క్వింటాళ్ల లడ్డూలు అందించనున్నారు
ముందుగా రామ్ లాలాకు వెండి పళ్లెంలో నైవేద్యాలు సమర్పిస్తారు. భోగ్ తర్వాత వచ్చే వీఐపీలకు ఈ ప్రసాదాన్ని అందజేస్తారు. దర్శనానికి వచ్చే రామభక్తులకు కూడా ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రాంలాలాకు 44 క్వింటాళ్ల లడ్డూలు అందించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
Tags
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.