UP elections: ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు
- Author : hashtagu
Date : 21-12-2021 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఇద్దరు పిల్లల మిరయా వాద్రా (18), రైహన్ వాద్రా (20) ఇంస్టాగ్రామ్ అకౌంట్ లను హ్యాక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇంకా ఎంపని లేదా అని ప్రశ్నించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగరాజ్ పర్యటన పై స్పందిస్తూ.. అయిదు సంవత్సరాలలో గుర్తుకురాని మహిళలు కేవలం ఇప్పుడు ఎన్నికల ముందే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.