Nari Shakti: 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
- By Hashtag U Published Date - 08:40 PM, Mon - 7 March 22
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంభాషించనున్నారు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళల సాధికారత కోసం వారి అసాధారణమైన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇవ్వనున్నారు. మహిళ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. సమాజాభివృద్ధిలో మహిళలను సమాన భాగస్వాములుగా గుర్తించే ప్రయత్నమే ఈ అవార్డులని ప్రదానం చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
నారీ శక్తి పురస్కార గ్రహీతలు వ్యవస్థాపకత, వ్యవసాయం, ఆవిష్కరణలు, సామాజిక పని, విద్య మరియు సాహిత్యం, భాషాశాస్త్రం, కళలు మరియు చేతిపనులు, STEMM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం), వైకల్య హక్కులు, మర్చంట్ నేవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ వంటి రంగాలకు చెందినవారికి ఇవ్వనున్నారు. అవార్డు గ్రహీతలలో సామాజిక వ్యవస్థాపకురాలు అనితా గుప్తా, సేంద్రీయ రైతు, గిరిజన ఉద్యమకారిణి ఉషాబెన్ దినేష్భాయ్ వాసవా, ఇన్నోవేటర్ నసీరా అఖ్తర్, ఇంటెల్-ఇండియా హెడ్ నివృత్తి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ డ్యాన్సర్ సైలీ నంద్కిషోర్ అగవానే, మొదటి మహిళా పాము రక్షకురాలు వనితా జగ్దేమాటిక్ వనితా జగ్దేమాటిక్ ఉన్నారు
Related News
Women’s Day : మహిళల ప్రాతినిధ్యం గురించి..
Women’s Day: కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో గతంతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో ఎంత మెరుగుదల ఉందో తెలుసుకుదాం.. వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తే, గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరింత నిశితంగా గమనిస్తే ఆ గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారత్లో మహిళా శ్ర�