Speed News
-
AP : డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: ఏపీ హైకోర్టు
“డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదన్న నిషేధం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించింది. ప్రజాహిత వ్యాజ్యాల పేరుతో రాజకీయ అజెండాలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు హైకోర్టు సహించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలు సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించింది. కేవలం రాజకీయ కారణాలతో, వ్యక్తిగత అభిప్రాయాలతో కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొంది.
Date : 10-09-2025 - 12:03 IST -
CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసారు.
Date : 10-09-2025 - 11:20 IST -
High Alert : నేపాల్లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, నేపాల్లో నెలకొన్న అశాంతి వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని, కొందరు రాడికల్ గ్రూపులు భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. దీంతో సరిహద్దులోని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు, సశస్త్ర సీమా బలగాలు (SSB) అప్రమత్తమయ్యాయి
Date : 10-09-2025 - 10:52 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.
Date : 10-09-2025 - 10:44 IST -
Kumari Aunty : నెట్టింట వైరల్గా మారిన కుమారీ ఆంటీ వీడియో
Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్గా మారారు.
Date : 10-09-2025 - 10:33 IST -
Minister Lokesh : మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి రక్షణకు చర్యలు
ఇటీవల నేపాల్ దేశం లో చోటుచేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే నారా లోకేష్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Date : 10-09-2025 - 10:32 IST -
Vice President Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం
Vice President Elections : మొత్తం పోలైన ఓట్లలో రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో కీలకమైన బిజూ జనతా దళ్ (బి.జె.డి), భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్), మరియు శిరోమణి అకాలీ దళ్ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండటం గమనార్హం
Date : 09-09-2025 - 7:37 IST -
Nepal : నేపాల్లో రాజకీయ సంక్షోభం… ప్రధాని ఓలీ రాజీనామా
రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ముఖ్య సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. "సోషల్ మీడియా దుర్వినియోగం చెందుతోందని" అంటూ తీసుకున్న ఈ నిర్ణయం యువతను ఆగ్రహపెట్టింది.
Date : 09-09-2025 - 3:45 IST -
Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Date : 09-09-2025 - 2:25 IST -
Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు
Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Date : 09-09-2025 - 1:44 IST -
Kerala : కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ కలకలం.. నెల రోజుల్లో ఐదుగురి మృతి
Kerala : ‘అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్’ (Amebic Meningoencephalitis) అనే ఈ అరుదైన వ్యాధి కేవలం ఒక నెల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 09-09-2025 - 11:32 IST -
Group-1 Case : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితా రద్దు
ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఎంపిక దశలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియపై అనేక మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో పారదర్శకత లేకపోవడం, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వారు ఆరోపించారు.
Date : 09-09-2025 - 11:23 IST -
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ అనంతరం, అదే రోజు రాత్రి 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే (NDA) అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.పి. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీ చేస్తున్నారు.
Date : 09-09-2025 - 10:49 IST -
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 08-09-2025 - 5:28 IST -
Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్కార్ మోడల్లో మాత్రమే నడుస్తున్నాయి.
Date : 08-09-2025 - 5:20 IST -
Bathukamma Sarees : ఆ మహిళలకే బతుకమ్మ చీరలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Bathukamma sarees : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
Date : 08-09-2025 - 4:35 IST -
IAS Transfer : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ
. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని అర్థవంతంగా విశ్లేషించి, చక్కటి పరిపాలనకు దోహదపడేలా, మంచి పనితీరును ప్రోత్సహించేలా ఈ మార్పులు చేశారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
Date : 08-09-2025 - 4:19 IST -
YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
ఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు.
Date : 08-09-2025 - 2:48 IST -
KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Date : 08-09-2025 - 2:38 IST