Speed News
-
Rain Alert: బంగాళాఖాతం భారీ మార్పులు.. రానున్న రోజుల్లో పిడుగుల వర్షం
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అం
Date : 26-06-2026 - 9:55 IST -
Tungabhadra: ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్ర డ్యామ్కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్
Date : 25-06-2026 - 1:48 IST -
Ketan Agarwal: కేతన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై.. కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి. ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప
Date : 25-06-2026 - 12:41 IST -
AP Electricity Charges: విద్యుత్ చార్జీలపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గత పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ భారానికి స్వస్తి పలుకుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుడి నడుం విరిచారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతూ యూనిట్పై 13 పైసల మేర ఛార్జీలను తగ్గించామని రాష్ట్ర ఇంధన
Date : 25-06-2026 - 11:55 IST -
AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలతో పాటుగా ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా చో
Date : 25-06-2026 - 8:57 IST -
Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్ అని తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్
Date : 24-06-2026 - 2:25 IST -
Weather Report: ఏపీలో భారీ రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏ
Date : 24-06-2026 - 9:33 IST -
Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి (Sree Charani) నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్కప్లో తిప్పేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్కు ఎగబాకింది. https://www.icc-cricket.com/tournaments/womens-t20-worldcup-2026/news/india-spinner-be
Date : 23-06-2026 - 4:24 IST -
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు, విచారణ నిమిత్తం నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విష
Date : 23-06-2026 - 2:49 IST -
Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న
Date : 23-06-2026 - 12:00 IST -
ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్లపై ఏసీబీ దాడులు..
హైదరాబాద్లో క్సైజ్ అధికారి ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిచింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నమోదైన కేసు నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి చెందిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించింది.హైదరాబాద్లోని అల్వాల్లో ఉన్న మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, అనుమానిత బినామీలకు
Date : 23-06-2026 - 11:48 IST -
Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘటనలో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పలువురు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రామ్ కృష్ణ ఉపాధ్యాయ్, వీరేంద్ర ప్రసాద్ శుక్లా, తుషక్ కృష్ణ జైస్వాల్, సురేష్ కుమార్ సాహూ ఉన్నారు. అదే స
Date : 23-06-2026 - 11:42 IST -
AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!
రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల
Date : 22-06-2026 - 6:11 IST -
Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. వెంకన్న మృతి చెందారు. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూరు సమీపంలో RTA అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రవాణా అ
Date : 22-06-2026 - 3:56 IST -
CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్
Date : 22-06-2026 - 2:48 IST -
Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజరుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ
Date : 22-06-2026 - 2:44 IST -
Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు
విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయ
Date : 22-06-2026 - 2:38 IST -
YS Jagan Mohan Reddy: రేపు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు. రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ
Date : 22-06-2026 - 1:11 IST -
Hyderabad : హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్కు షాక్.. సిగిరెట్ తెమ్మని..?
హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ని మోసగించి కార్తో దుండగుడు పరారైయ్యాడ. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక
Date : 22-06-2026 - 12:35 IST -
Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరి హిల్స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మరియు సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్లో సాఫ్ట్వేర
Date : 22-06-2026 - 12:20 IST