Speed News
-
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
Hyderabad:పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఉండే వాళ్లంతా ఊరిబాట పడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఫ్యామిలీతో సహ ఊళ్లకు పయమనవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేశారు.
Date : 09-01-2022 - 1:35 IST -
Siddipet Farmers:బ్యాంకు ఉద్యోగుల మోసాన్ని బట్టబయలు చేసిన రైతులు
సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు చేస్తున్న మోసాన్ని రైతులు బట్టబయలు చేశారు.
Date : 09-01-2022 - 1:29 IST -
Srisailam:శ్రీశైలం ఆలయంలో కోవిడ్ ఆంక్షలు.. ?
కరోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
Date : 09-01-2022 - 12:49 IST -
Deverakonda: 100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ఇ స్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.
Date : 09-01-2022 - 11:45 IST -
MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు
నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Date : 09-01-2022 - 11:36 IST -
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Date : 09-01-2022 - 10:27 IST -
Maharashtra:మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది.
Date : 09-01-2022 - 10:05 IST -
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Date : 09-01-2022 - 10:01 IST -
Ramesh Babu:హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Date : 08-01-2022 - 10:18 IST -
Modi call to Bandi: బండి సంజయ్ కి మోడీ ఫోన్!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలంగాణ లో తాజా రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీశారు. తెలంగాణలో చోటుచేసుకుంటన్న పరిస్థితులు, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను మోడీకి తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 15 నిమిషాల పాటు మోడీ బండి సంజయ్ తో మాట్లాడినట్టు సమాచారం. బండి
Date : 08-01-2022 - 6:00 IST -
Gujarat: పక్షుల ప్రేమికుడు.. భగవంజీ!
గుజరాత్కు చెందిన భగవంజీ 40 అడుగుల ఎత్తులో ఈ బర్డ్ హౌస్ని నిర్మించడానికి రూ. 20 లక్షలు వెచ్చించారు. అతను తన సొంత డబ్బు, భూమితో భారీ పక్షుల గృహాన్ని నిర్మించాడు. పక్షులకు సురక్షితమైన స్వర్గధామం ఇవ్వడానికి ఆయన శ్రమిస్తున్నారు. ఈయన అన్ని జీవులకు సమాన ప్రాతినిధ్యం వహించాలని నమ్మే ప్రకృతి ప్రేమికుడు. పక్షులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, ఆహారం, నీరు కూడా అందిస్తూ మనవత్వాన్ని
Date : 08-01-2022 - 5:47 IST -
Cinema: ఓటీటీ లో ‘శ్యామ్ సింగ రాయ్’
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా క్రితం నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. 70వ దశకం ప్రధానంగా నడిచే ఈ కథలో నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించారు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ తీసుకోగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప
Date : 08-01-2022 - 5:29 IST -
Video: చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..
సైనికులు దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశ రక్షణకై పెద్ద పీట వేస్తారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావానికి అద్దం పడుతున్నాయి.
Date : 08-01-2022 - 5:04 IST -
Telangana: సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు కోరారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తినుకున్నారు. సంక్రాంతి వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి క
Date : 08-01-2022 - 4:50 IST -
Lock down: నైట్ కర్ఫ్యూ పై సీఎం క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూపోతుండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో చెలరేగిపోతున్నారు.కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్
Date : 08-01-2022 - 3:42 IST -
Punjab Icon: సోనూ సూద్ నియామకం రద్దు- ఎన్నికల సంఘం
ప్రముఖ నటుడు సోనూ సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ప్రజాస్వామ్యం పై ప్రజల్లో చైతన్యం కలిగించి ఎన్నికల్లో పాల్గొనేలా చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబరులో సోనూ సూద్ ను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం నియమించడం తెలిసిందే. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ఎన్నికల ప్రధాన అధికారి డా
Date : 08-01-2022 - 2:50 IST -
Andhra Pradesh: ఇంటర్మీడియట్ పరీక్షలు.. మే 5 నుంచి?
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర(హాఫ్ ఇయర్) పరీక్షలు నిర్వహించిన అధికారులు.. బోర్డు పరీక్షలపై దృష్టిసారించారాని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఆ సమయంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల
Date : 08-01-2022 - 2:19 IST -
China: చైనాలో భారీ భూకంపం
చైనా దేశంలోని కింగ్ హై ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కింగ్హై ప్రావిన్స్లోని మెన్యువాన్ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 1:45
Date : 08-01-2022 - 2:09 IST -
Suicide: బెజవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం..
విజయవాడలో ఒకే కుటుంబానికి చెందన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా..కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు ఆత్మహత్యకు చేసుకున్నారు. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా పోల
Date : 08-01-2022 - 12:30 IST