Kanpur Road Accident: యూపీలోని జీటీ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర ప్రదేశ్ నరామౌ సమీపంలోని జీటీ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మరణించగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు
- Author : Praveen Aluthuru
Date : 14-05-2023 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
Kanpur Road Accident: ఉత్తర ప్రదేశ్ నరామౌ సమీపంలోని జీటీ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మరణించగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికి రమా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన బిత్తూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మే 13 అర్థరాత్రి కళ్యాణ్పూర్ నుంచి ఆటో డ్రైవర్ ప్రయాణికులతో మంధానకు వెళ్తుండగా నరమావు సమీపంలో మంధాన వైపు నుంచి వస్తున్న పీఎన్సీ కంపెనీకి చెందిన డంపర్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆటో, డంపర్ రెండూ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 35 ఏళ్ల ఆటో రైడర్ అక్కడికక్కడే మృతి చెందగా, చౌబేపూర్లోని షాపూర్లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ అశుతోష్ పాండే, చౌబేపూర్ కచోరాకు చెందిన అనిషా, ఆమె కుమార్తె సనా, మంధాన నివాసి షబ్నం, కుక్రదేవ్కు చెందిన అనిల్ సవిత, రెహనా తీవ్రంగా గాయపడ్డారు.
వాహనాలు బోల్తా పడడంతో జీటీ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన క్షతగాత్రులను మంధానలోని రామ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి జేబులో నుంచి రూ.4,500 ఉన్నాయని, అతని పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని స్టేషన్ ఇన్ఛార్జ్ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు.
Read More: Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి భూకంపం.. భయాందోళనలో స్థానికులు