NueGo: హైదరాబాద్-ఏలూరు రూట్లో న్యూగో బస్ సర్వీస్
గ్రీన్సెల్ మొబిలిటీ ద్వారా భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ న్యూగో ప్రీమియం ఇంటర్-సిటీ ఎసి ఎలక్ట్రిక్ బస్సు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. న్యూగో ఇప్పటికే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ కారిడార్లో హైదరాబాద్-
- By Praveen Aluthuru Published Date - 04:59 PM, Tue - 17 October 23
NueGo: గ్రీన్సెల్ మొబిలిటీ ద్వారా భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ న్యూగో ప్రీమియం ఇంటర్-సిటీ ఎసి ఎలక్ట్రిక్ బస్సు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. న్యూగో ఇప్పటికే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ కారిడార్లో హైదరాబాద్-విజయవాడ నుండి విజయవంతంగా సేవలు అందిస్తున్నది. ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-సిమ్లా, ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్, ఢిల్లీ-లూథియానా ఉత్తరాన మరియు బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నైతో సహా భారతదేశం అంతటా న్యూగో ప్రీమియం సేవలను అందిస్తోంది. దక్షిణాదిన బెంగళూరు, చెన్నై-పుదుచ్చేరి ప్రాంతాలలో సేవలను అందిస్తుంది.
న్యూగో హైదరాబాద్-ఏలూరు కొత్త రూట్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా గ్రీన్సెల్ మొబిలిటీ సీఈఓ మరియు ఎండీ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్నహైదరాబాద్ అర్బన్ సిటీని ఏలూరుతో కలుపుతూ న్యూగో సరికొత్త ఎలక్ట్రిక్ బస్సు మార్గాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు శుభ్రమైన, నిశ్శబ్దమైన మరియు మరింత స్థిరమైన ప్రయాణాన్ని అందించడమే న్యూగో లక్ష్యమన్నారు.
న్యూగోలో భద్రతాకు పెద్దపీట వేస్తున్నట్టు సంస్థ చెప్పింది. CCTV నిఘా, డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్లు, డ్రైవర్ పర్యవేక్షణ వ్యవస్థలు మరియు వేగ పరిమితి తనిఖీలు వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. అలాగే మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, లెగ్ స్పేస్ మరియు సౌకర్యవంతమైన వాలుగా ఉండే సీట్లు విమాన ప్రయాణానికి సమానమైన వాతావరణాన్ని కలుగజేస్తాయని చెప్పింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్తో 250 కిలోమీటర్లు ప్రయాణించగలవు.
ప్రయాణానికి సంబంధించి టిక్కెట్లను అధికారిక వెబ్సైట్ ( https://nuego.in/ ) ద్వారా లేదా NueGo యాప్, Redbus, Paytm మరియు Abhi బస్ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా సౌకర్యవంతంగా బుక్ చేసుకోవచ్చు.
Also Read: Sunset Point : సన్ సెట్ పాయింట్, మౌంట్ అబూ
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�