Ukraine Russia War: పుతిన్కు మోదీ ఫోన్.. ఇంతకీ ఏం చెప్పారంటే..?
- By HashtagU Desk Published Date - 09:13 AM, Fri - 25 February 22
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పోన్లో మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హింసను వదిలేయాలని పుతిన్కు మోదీ సూచించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఇక హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని మోదీ సూచించారు. అలాగే ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారని చెబుతున్నారు. ఈ క్రమంలో నాటో దేశాలు, రష్యాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నరేంద్ర మోదీ పుతిన్కు సూచించారు. ఇకపోతే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
PM Narendra Modi speaks to Russian President Vladimir Putin
Pres Putin briefed PM about the recent developments regarding Ukraine. PM reiterated his long-standing conviction that the differences between Russia & NATO can only be resolved through honest and sincere dialogue: PMO
— ANI (@ANI) February 24, 2022
Related News
Mamata Banerjee : కోల్కతాలోని రాజ్భవన్లో ప్రధాని ప్రతినిధి ఉన్నారు
సందేశ్ఖాలీ అంశంపై అసత్య ప్రచారం చేసే బదులు ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం అన్నారు .