BRS Minister: నాడు తండ్లాట.. నేడు తండాలు అభివృద్ధి బాట: మంత్రి ఎర్రబెల్లి
ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు.
- By Balu J Published Date - 05:04 PM, Fri - 29 September 23
కొడకండ్ల (పాలకుర్తి నియోజకవర్గం), సెప్టెంబర్ 29 : తెలంగాణకు ముందు నాడు తండాలది, తండా వాసులది చెప్పనలవిగాని తండ్లాట…! నేడు అవే తండాలు అభివృద్ధి బాట పట్టాయి. ప్రగతి పథంలో నడుస్తున్నాయి. తండాలు నాడు శివారు పల్లెలుగా అభివృద్ధికి నోచుకోక అర్రులు చాచేవి. నేడు స్వయం పాలనలో స్వతంత్ర పాలన సాగించుకుంటూ గ్రామ పంచాయతీలుగా వెలుగొందుతున్నాయి. నాడు 7శాతమే రిజర్వేషన్లు ఉండే! నేడు కెసిఆర్ సిఎం అయ్యాక 12శాతానికి రిజర్వేషన్లు పెంచారు. కానీ, కాంగ్రెస్ నేడు గిరిజనుల మధ్య వర్గీకరణ చిచ్చు పెడుతున్నది. నాడు అభివృద్ధి కోసం అర్రులు చాచిన తండాలే…! నేడు ప్రగతి పథాన నడుస్తున్నాయి. నాడు కనీస సదుపాయాలు కరువు! కానీ, నేడు సకల సౌకర్యాలకు నెలవుగా తండాలు మారాయి. నాడు కన్నీటి కడలిలు…! నేడు సాగు, తాగునీటికి నెలవులు!! ఇదంగా సీఎం కెసిఆర్ దయ వల్లే జరిగాయి. అందుకు తండా వాసులు కెసిఆర్ కు రుణ పడి ఉండాలె. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గిర్ని తండ, మైదం చెరువు తండ, చెరువు ముందు తండ, నీలిబండ తండా, బొడోని కుంట తండ, రామేశ్వరం, కడగుట్ట తండ, హక్య తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మండలంలో తండా బాట నిర్వహించారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపన, అలాగే సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొన్ని బీటీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, వివిధ గుడు ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి కొడకండ్ల మండలంలో తండా బాట నిర్వహించారు. అలాగే తండాలకు మినీ ఫంక్షన్ హాళ్ళ తరహాలో కమ్యూనిటీ భవనాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గిర్నితండా, మైదం చెరువు తండా దుర్గమ్మ, ఎల్లమ్మ గుడుల నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ కు ముందు తండాలు సాగునీరు, లేక, మంచినీరు లేక, కనీస సదుపాయాలు లేక తండ్లాడేవి. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ తర్వాత, కెసిఆర్ సీఎం అయ్యాక తండాల తండ్లాట తప్పించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చారు. వారి తండాల్లో వారి రాజ్యాన్ని తెచ్చారు. దీంతో మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది పోయే బాధ తప్పింది. సాగునీటితోపాటు భూగర్భ జలాలు పెరిగాయి. ఇతర గ్రామాల శివార్లుగా ఉండే తండాలకు కనీస సదుపాయాలు కలిగాయి. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో తండాకు రూ.కోటి తో అభివృద్ధి జరిగింది. ఇంకా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి తండాకు నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు అవుతున్నది. అన్నారు.
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది అయితే, అదే ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్నది. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కష్టాలు తప్పవు అన్నారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోంది. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల బిఆర్ ఎస్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. మన కోసం పాటుపడుతున్న సీఎం కెసిఆర్ కు, నాకు అండగా నిలవాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బతుకమ్మలను ఎత్తుకున్నారు.
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�