Finance Rules: అక్టోబర్ నెల నుంచి మారనున్న ఫైనాన్షియల్ రూల్స్ ఇవే..!
వచ్చే నెల నుంచి (1 అక్టోబర్ 2023 నుండి మనీ రూల్స్) అనేక డబ్బు సంబంధిత నియమాలలో పెద్ద మార్పులు (Finance Rules) జరగబోతున్నాయి.
- By Gopichand Published Date - 11:58 AM, Sat - 23 September 23
Finance Rules: సెప్టెంబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే నెల నుంచి (1 అక్టోబర్ 2023 నుండి మనీ రూల్స్) అనేక డబ్బు సంబంధిత నియమాలలో పెద్ద మార్పులు (Finance Rules) జరగబోతున్నాయి. అక్టోబర్ 1, 2023 నాటికి SEBI మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినీలను తప్పనిసరి చేసింది. దీంతో పాటు రూ.2000 నోట్ల మార్పిడి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఇటువంటి పరిస్థితిలో అక్టోబర్ 1 నుండి మారే కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ నుంచి ఈ నిబంధనలలో మార్పులు జరగనున్నాయి
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో నామినీలు తప్పనిసరి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలలో నామినీలను తప్పనిసరి చేసింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ తేదీలోపు ఎవరైనా ఖాతాదారు నామినీని యాడ్ చేయకపోతే అక్టోబర్ 1 నుండి ఖాతా వర్క్ చేయదు. ఆ తర్వాత డీమ్యాట్, ట్రేడింగ్ ఆపరేట్ చేయలేరు. అంతకుముందు సెబీ.. డిమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల నామినేషన్ గడువును మార్చి 31గా నిర్ణయించింది. తరువాత దానిని మరో ఆరు నెలలు పొడిగించింది. మీరు మీ ఖాతాలో నామినీని జోడించకుంటే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.
మ్యూచువల్ ఫండ్లో నామినీలు
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు కాకుండా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు నామినీలు తప్పనిసరి చేయబడింది. ఇందుకోసం సెబీ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. మీరు నిర్ణీత గడువులోపు నామినీల ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ ఖాతా ఆగిపోతుంది. దీని తర్వాత మీరు ఇందులో పెట్టుబడి పెట్టలేరు లేదా ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
TCS నిబంధనలలో మార్పులు
మీరు వచ్చే నెల నుండి విదేశాలలో టూర్ ప్యాకేజీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీ కోసం ఒక వార్త ఉంది. 7 లక్షల లోపు టూర్ ప్యాకేజీని కొనుగోలు చేస్తే 5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.7 లక్షల కంటే ఎక్కువ విలువైన టూర్ ప్యాకేజీలకు 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
రూ.2000 నోట్ల మార్పిడికి గడువు
మీరు ఇంకా రూ.2000 నోట్లను మార్చుకోకపోతే సెప్టెంబర్ 30లోగా ఈ పని చేయండి. సెప్టెంబర్ 30, 2023 నాటికి రూ.2000 నోటును మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. తర్వాత ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే ఈ పనిని పూర్తి చేయండి.
జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి
వచ్చే నెల నుంచి ఆర్థిక, ప్రభుత్వ పనుల నిబంధనలలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకురానుంది. అక్టోబర్ 1 నుండి పాఠశాల, కళాశాలలో అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు, ఓటరు జాబితాలో పేరు జోడించడం, ఆధార్ నమోదు, వివాహ నమోదు లేదా ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తు వంటి అన్ని పనులకు జనన ధృవీకరణ పత్రం అవసరం.
సేవింగ్స్ ఖాతాలో ఆధార్ తప్పనిసరి
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయింది. PPF, SSY, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మొదలైన వాటిలో ఆధార్ సమాచారాన్ని నమోదు చేయడం అవసరం. మీరు దీన్ని చేయకపోతే వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఈ సమాచారాన్ని నమోదు చేయండి. లేకపోతే అక్టోబర్ 1 నుండి ఈ ఖాతాలు స్తంభింపజేయబడతాయి.
Related News
Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఐస్ క్రీమ్.. అసలేం జరిగిందంటే..?
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.