Murder : హైదరాబాద్ బోయిన్పల్లిలో దారుణం.. రియల్టర్ను హత్య చేసిన దుండగులు
హైదరాబాద్ బోయిన్పల్లిలోని దిల్కుషానగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంటి
- By Prasad Published Date - 06:41 AM, Wed - 8 February 23
హైదరాబాద్ బోయిన్పల్లిలోని దిల్కుషానగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంటి వద్దే దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. మృతుడు మూసా సిద్ధిఖీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని ఆస్తుల విషయంలో కొందరితో వివాదాలు ఉన్నట్లు సమాచారం. సిద్ధిఖీ తన ఇంట్లో ఉండగా కొందరు వ్యక్తులు అతడిని కలవడానికి వచ్చి కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశారు. అతన్ని చంపిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు, నార్త్జోన్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చాంద్రాయణగుట్టకు చెందిన కొందరితో సిద్దిఖీకి ఆర్థిక వివాదాలు ఉన్నాయని, వారే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�