HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Sensational Press Meet

Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.

  • Author : Latha Suma Date : 03-09-2025 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

Kavitha : నాపై అక్రమంగా కేసులు పెట్టి ఐదున్నర నెలలపాటు జైలులో ఉంచారు. కానీ జైలు నుంచి బయటకి వచ్చిన నాటి నుంచే ప్రజల కోసం నిత్యం పని చేశాను అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 23న జైలు నుంచి విడుదలైన అనంతరం చేసిన పలు ప్రజా సేవా కార్యక్రమాలను కవిత ఇవాళ మీడియా సమావేశంలో గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సెప్టెంబర్ 2న ఆమెకు తాత్కాలిక బహిష్కరణ విధించిన తరవాత తొలిసారి పబ్లిక్‌గా మాట్లాడిన కవిత, పార్టీపై తీవ్రస్థాయిలో స్పందించారు. గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.

మహిళల హక్కుల కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె, వృద్ధులపై తెలంగాణ తల్లి చిత్రాన్ని మారుస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. అంతేకాక, ఏపీ నిర్మాణంలో ఉన్న బనకచర్ల ప్రాజెక్టు, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ముందుండినట్టు చెప్పారు. భద్రాచలం వద్ద 5 గ్రామాల ముంపు సమస్యపై స్పందించింది మేమే. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్లో నారాయణపేట వెళ్లి బాధితులకు మద్దతుగా నిలిచాం అని కవిత వివరించారు. గత కొన్ని నెలలుగా ఆమె 47 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని తెలిపారు. ఇవి పార్టీ వ్యతిరేక చర్యలా? కేసీఆర్‌కు ఆ విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా అంటూ కవిత మండిపడ్డారు.

ఇక, తన సస్పెన్షన్‌పై స్పందిస్తూ..బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నన్ను… కొందరు పార్టీ నేతలు పనికట్టుకుని దుష్ప్రచారం చేశారు. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు, సంతోష్ రావులు కవిత తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్న “దెయ్యాలు” అన్న ఆమె వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం అవినీతికి కారణం వారే. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కొంతకాలం హరీష్ రావును అణచివేశారు అంటూ ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే చివరకు పార్టీకి నష్టం చేకూర్చాయని బీఆర్ఎస్ భావించినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఆమెను తొలగించిన తరువాత, ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్ తదితరులు హాజరయ్యారు. బంగారు తెలంగాణ అనేది నా కల. అది కొంతమంది ఇళ్లలో బంగారం ఉన్నదంత మాత్రాన రాదు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి కలగాలి. అదే నా అభిప్రాయం. కానీ దాన్ని తప్పుగా ప్రచారం చేశారు అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా నష్టపెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను, తెలంగాణ రాజకీయాలను హిలిచిన వేళ పార్టీ నిర్ణయాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆమె సస్పెన్షన్ రద్దవుతుందా? లేదా కొత్త రాజకీయ ప్రస్థానానికి ఆమె బీజం వేస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవనుంది.

Read Also: viral video : ఇయర్‌ఫోన్‌ ఎపిసోడ్‌ మళ్లీ రిపీట్‌..పాక్‌ ప్రధానికి పుతిన్‌ ట్యూటర్‌గా మారిన ఘటన వైరల్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 42 percent reservation for BCs
  • brs
  • kaleshwaram project
  • kcr
  • MLC Kavitha
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd