Hyderabad: రెస్టారెంట్ లో పెరుగు కోసం యువకుడు దారుణ హత్య
పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ కి వచ్చిన వ్యక్తిని సిబ్బంది చంపేసిన ఘటన నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 11:57 AM, Mon - 11 September 23
Hyderabad: పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ కి వచ్చిన వ్యక్తిని సిబ్బంది చంపేసిన ఘటన నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. చాంద్రాయణగుట్టలోని హష్మతాబాద్కు చెందిన బాధితుడు మహ్మద్ లియాఖత్ (31) ఆదివారం రాత్రి 11 గంటలకు తన స్నేహితుడితో కలిసి భోజనానికి రెస్టారెంట్కు వచ్చాడు. తాను రైతా కావాలని సిబ్బందిని కోరడంతో వాగ్వాదం మొదలైంది. హోటల్లోని వెయిటర్ అతని అభ్యర్థనను పట్టించుకోలేదని వాగ్వాదానికి దిగాడు. మేనేజర్ మరియు ఇతర సిబ్బంది అతనిపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్రమైంది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. త్వరితగతిన విచారిస్తామని హామీ ఇచ్చారు.
Panjagutta Meridian Hotel Kay Management Se Bandlaguda Hashamabad Ka Rahne Wale Mohd Liyqhat Bhai Se Hotel Ka Staff Se Jhagda Ho Gaya Thaa Is Waqhiye'h Kay Baad Inhe Zere Ilaaj Ke Liye Deccan Hospital Shift Karwya Gaya Lekin Doctor nay Inkay Inteqal Ki Khabar Sunwayi Hai,
1/4 pic.twitter.com/t4Ohph2ORK
— Mirza Rahmat Baig (@_MirzaRahmath) September 10, 2023
Also Read: PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి : పీవీ రమేశ్
Related News
KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేశారు.