LSG Beats CSK: చెన్నైకు షాకిచ్చిన లక్నో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG Beats CSK) ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఆడిన CSK 57 పరుగులతో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్తో 176 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 11:46 PM, Fri - 19 April 24
LSG Beats CSK: చెన్నై సూపర్ కింగ్స్పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG Beats CSK) ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఆడిన CSK 57 పరుగులతో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్తో 176 పరుగులు చేసింది. చివరలో MS ధోని 28 పరుగులతో మరోసారి రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఎల్ఎస్జీ జట్టు ఆరంభంలోనే తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. లక్నోలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ అర్ధసెంచరీలు చేశారు. డి కాక్ 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కాగా రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
15వ ఓవర్ చివరి బంతికి డి కాక్ ఔట్ కాగా ఈ సమయంలో జట్టు స్కోరు 134 పరుగులు. చివరి 30 బంతుల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా 43 పరుగులు చేయాల్సి ఉంది. ఓ వైపు రాహుల్ క్రీజులో నిలువగా, మరో ఎండ్ నుంచి నికోలస్ పురాన్ వచ్చిన వెంటనే సీఎస్కే బౌలర్ల మీద విరుచుపడ్డాడు. తరువాతి 2 ఓవర్లలో LSG బ్యాట్స్మెన్ 27 పరుగులు చేశారు. దీని కారణంగా మ్యాచ్ ఫలితం లక్నో వైపుకు మళ్లీంది.
Also Read: Kejriwal: నేను కేవలం మూడు మామిడి పండ్లు తిన్నాను.. కేజ్రీవాల్
ఈ క్రమంలో లక్నోకు 18 బంతుల్లో 16 పరుగులు కావాలి. చివరి ఓవర్లలో బంతి సరిగ్గా బ్యాట్కు తగలకపోవడంతో బ్యాట్స్మెన్కు పరుగులు చేయడం కష్టంగా మారింది. కాగా, తుషార్ దేశ్పాండే 19వ ఓవర్లోనే 15 పరుగులు ఇచ్చి లక్నో విజయాన్ని ఖాయం చేశాడు. నికోలస్ పూరన్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి విన్నింగ్ షాట్ కొట్టి LSGని 8 వికెట్ల తేడాతో గెలిపించాడు.
We’re now on WhatsApp : Click to Join
CSK బౌలింగ్ విఫలమైంది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించలేకపోయారు. చెన్నై తరుపున ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతిషా పతిరనా మాత్రమే ఒక్కో వికెట్ తీశారు. పిచ్ ప్రకారం CSK డిఫెండ్ చేయడానికి తక్కువ స్కోరును కలిగి ఉంది. కాబట్టి బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వికెట్లు తీయవలసి ఉంటుంది. అయితే రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్ వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.
Related News
SRH vs RR: నేడు సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. హైదరాబాద్ ఫామ్లోకి వస్తుందా..?
ఐపీఎల్ 2024లో 50వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి జరగనుంది.