Councillor: మహబూబాబాద్ లో కౌన్సిలర్ దారుణ హత్య!
కౌన్సిలర్ను పట్టపగలు గొడ్డలితో హత్య చేయడంతో పలువురికి వెన్నులో వణుకు పుట్టించింది.
- By Balu J Published Date - 05:08 PM, Thu - 21 April 22
తెలంగాణలోని మహబూబాబాద్ కు చెందిన ఓ స్వతంత్ర కౌన్సిలర్ను పట్టపగలు పట్టిపాక రోడ్డులో గురువారం గొడ్డలితో హత్య చేయడంతో పలువురికి వెన్నులో వణుకు పుట్టించింది. మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన బానోత్ రవి నాయక్ (34) మృతి చెందాడు. రవి ఏదో పనికి వెళ్లి బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దుండగులు అతని ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ట్రాక్టర్తో ఢీకొట్టినట్లు సమాచారం. అనంతరం ఆ వెనుకే ఉన్న కారులో వెంబడించిన మరో ముగ్గురు అతడిపై విచక్షణా రహితంగా గొడ్డళ్లతో దాడి చేసి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఇది గమనించిన కొందరు బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించగానే కౌన్సిలర్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Related News
Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకు�