మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?
- By Nakshatra Published Date - 03:27 PM, Sat - 11 June 22

సీజనల్గా దొరికే మామిడి కాయలతో అనూష అని ఒక మహిళ ఏకంగా లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష అనే వివహిత ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో ఈ మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. అయితే మొదటి ఏడాది అనూష,రామకృష్ణ కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశారట.
అయితే అనూష వాళ్ళ బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాము. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను పనిలో పెట్టుకున్నం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం వరకు చూశాం అని తెలిపారు. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం అని చెప్పుకొచ్చింది అనూష.
Related News

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో