మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?
- By Nakshatra Published Date - 03:27 PM, Sat - 11 June 22
సీజనల్గా దొరికే మామిడి కాయలతో అనూష అని ఒక మహిళ ఏకంగా లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష అనే వివహిత ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో ఈ మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. అయితే మొదటి ఏడాది అనూష,రామకృష్ణ కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశారట.
అయితే అనూష వాళ్ళ బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాము. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను పనిలో పెట్టుకున్నం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం వరకు చూశాం అని తెలిపారు. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం అని చెప్పుకొచ్చింది అనూష.
Related News
Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.రాగల ఐదురోజుల �