JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన హైదరాబాదీ.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి JEE అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను (JEE Advanced Results) ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి.
- By Gopichand Published Date - 11:10 AM, Sun - 18 June 23
JEE Advanced Results: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి JEE అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను (JEE Advanced Results) ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్లైన్ మోడ్ ద్వారా చూసుకోవచ్చు. IIT గౌహతి అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో ఫలితాలు ప్రకటించబడ్డాయి. JEE అడ్వాన్స్డ్ ఫలితాలను వీక్షించడానికి అభ్యర్థులు రోల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.
ఫలితాలను చెక్ చేసుకోండిలా
JEE అడ్వాన్స్డ్ 2023లో హాజరైన విద్యార్థులు ఇక్కడ ఇచ్చిన పాయింట్లను అనుసరించడం ద్వారా తమ ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు ముందుగా jeeadv.ac.in అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఫలితం ప్రకటించిన తర్వాత లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు రోల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి అభ్యర్థించిన సమాచారాన్ని సమర్పించాలి. ఇప్పుడు మీ ఫలితం కొత్త పేజీలో తెరవబడుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుండి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఫలితాల విడుదలతో పాటు, అభ్యర్థుల కోసం తుది సమాధాన కీని కూడా విడుదల చేశారు.
Also Read: Kamala Sohonie : నోబెల్ గ్రహీత సీవీ రామన్ నో చెప్పినా..పీహెచ్ డీ సాధించి చూపిన కమలా సోహోనీ
ఫలితాలతో టాపర్ల జాబితా విడుదల
JEE అడ్వాన్స్డ్ ఫలితాలు 2023 విడుదలతో IIT గౌహతి ద్వారా టాపర్ల జాబితాను కూడా విడుదల చేసింది. దీంతో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీల వారీగా అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ర్యాంక్ ప్రకారం అభ్యర్థులు టాప్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందుతారు. ఈ సంవత్సరం 1 లక్ష 90 వేల మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారు. JEE అడ్వాన్స్డ్ 2023 జూన్ 4న నిర్ణీత పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో నిర్వహించారు.
ఈ ఏడాది పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. రెండో షిప్టును మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్ష తాత్కాలిక సమాధానాల కీలు జూన్ 09, జూన్ 11 న విడుదల చేశారు. అనంతరం పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ 2023లో మొత్తం 1,80, 372 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ఏడాది పరీక్షలో హైదరాబాద్ జోన్కు చెందిన వీసీ రెడ్డి టాపర్గా నిలిచాడు. ఈ పరీక్షను మొత్తం 360 మార్కులకు నిర్వహించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పేపర్లు ఉన్నాయి. మొత్తం మూడు పేపర్లను రెండు షిఫ్టుల్లో 60-60 మార్కులకు నిర్వహించారు. ఇది కాకుండా పరీక్ష తుది సమాధాన కీని కూడా IIT గౌహతి విడుదల చేసింది.
Related News
CBSE: మాతృభాష నేర్పేందుకు సిద్ధమైన సీబీఎస్ఈ..!
ఇప్పుడు పిల్లలకు మాతృభాష నేర్పేందుకు సీబీఎస్ఈ సిద్ధమైంది.