Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కదాడిలో గాయపడ్డ బాలిక మృతి
- By Balu J Published Date - 03:25 PM, Sat - 12 August 23
Jagtial: కుక్కకాటు మరో బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగింది. పదిహేను రోజుల కిందటే పిచ్చి కుక్క దాడి చేసింది.
పట్టణంలో దాదాపు పది మంది గాయపడ్డారు. కానీ కుక్కల దాడిలో సంగెపు సాహితి అనే 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ చిన్నారి చికిత్స పొందుతూ ఈరోజు (శనివారం) ఉదయం మృతి చెందింది. తమ ముందు ఆడుకున్న చిన్నారి ఇక లేదని తెలిసి గ్రామం విషాదంలో మునిగిపోయింది.
Also Read: Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు
Related News
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యే