HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Government Will Come Again In The Telangana State Minister Harish Rao

Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు

బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

  • Author : Balu J Date : 12-08-2023 - 2:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ  కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ నిఅందించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ సంగారెడ్డిలో పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారు తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామపంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రెటరీ నియమించి పదివేల మంది పంచాయతి సెక్రటరీలకు ఉపాధి కల్పించాం. తెలంగాణ 3 శాతం ఉన్న జనాభా కు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉంది. ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వల్లే సాధ్యమైంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి అంటు రోగాలు నిర్మూలించగలిగాం’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘సంగారెడ్డిలో 300 మొదటి దశ బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇది దశలవారీగా కొనసాగుతుంది బీసీ బంధు నిరంతర ప్రక్రియ, బీసీ వర్గాలనే కాదు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా  బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసే అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 19 బీసీ గురుకుల పాఠశాలలుంటే ఈరోజు 310 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ కూడా చేసుకున్నాం’’ మంత్రి చెప్పారు.

‘‘కులవృత్తులు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజక సోదరులకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. 100 కోట్లతో 35 వేల సెలూన్లకు 60 వేల లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా గీత కార్మికుల కోసం పాత బకాయిల రద్దు చేసి చెట్టు పన్ను రద్దుచేసిన నాయకుడు కెసిఆర్ గారు. 6లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తున్నారు. నేతన్నను కూడా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మగ్గమున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా పింఛన్ ఇస్తున్నారు. సద్ది తిన్నరేవు కలవాలి అంటారు అందుకనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజలను కాపాడుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్లీ గెలిపీయాలి. కాంగ్రెస్ వాళ్లకు మాట్లాడడానికి మాటల్లేవు. నిలబెట్టడానికి నాయకులు లేరు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘కాంగ్రెస్ అధికారంలోకొస్తే మూడు గంటలు కరెంటు చాలు అంటున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దొంగరాత్రి కరెంటు ఇచ్చిర్రు ఇప్పుడు అది కూడా ఇయ్యరంట 3 గంటలే ఇస్తారంట. మూడు గంటల కరెంటు చాలు అంటే ఏ రైతన్నయినా కాంగ్రెస్ను మరి చూస్తాడా. కరెంటు కోతలతో రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. రైతులను పోలీస్ స్టేషన్లో లైన్లో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలపైన ఆలోచన లేదు కాంగ్రెస్కి. ఈరోజు 70 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. రైతు రుణమాఫీ రద్దు చేయరేమో అనుకొని దింపుడు గల ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు రైతు రుణమాఫీ చేసి బుద్ధి చెప్పారు కెసిఆర్ గారు. రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేసిండు. కాలేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండు 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. ఆగస్టు 15 నుంచి షురూ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Bandhu
  • cm kcr
  • harish rao
  • siddipet

Related News

Revanth Reddy Became A Pois

Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు

Gurukul Hostel Food : తెలంగాణ రాష్ట్రంలోనూ గురుకుల పాఠశాలల్లో నిత్యం విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి అవుతున్నారు

    Latest News

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

    • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

    • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

    • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

    • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd