Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు
బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
- By Balu J Published Date - 02:46 PM, Sat - 12 August 23
సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ నిఅందించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ సంగారెడ్డిలో పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారు తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామపంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రెటరీ నియమించి పదివేల మంది పంచాయతి సెక్రటరీలకు ఉపాధి కల్పించాం. తెలంగాణ 3 శాతం ఉన్న జనాభా కు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉంది. ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వల్లే సాధ్యమైంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి అంటు రోగాలు నిర్మూలించగలిగాం’’ అని హరీశ్ రావు అన్నారు.
‘‘సంగారెడ్డిలో 300 మొదటి దశ బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇది దశలవారీగా కొనసాగుతుంది బీసీ బంధు నిరంతర ప్రక్రియ, బీసీ వర్గాలనే కాదు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసే అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 19 బీసీ గురుకుల పాఠశాలలుంటే ఈరోజు 310 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ కూడా చేసుకున్నాం’’ మంత్రి చెప్పారు.
‘‘కులవృత్తులు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజక సోదరులకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. 100 కోట్లతో 35 వేల సెలూన్లకు 60 వేల లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా గీత కార్మికుల కోసం పాత బకాయిల రద్దు చేసి చెట్టు పన్ను రద్దుచేసిన నాయకుడు కెసిఆర్ గారు. 6లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తున్నారు. నేతన్నను కూడా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మగ్గమున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా పింఛన్ ఇస్తున్నారు. సద్ది తిన్నరేవు కలవాలి అంటారు అందుకనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజలను కాపాడుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్లీ గెలిపీయాలి. కాంగ్రెస్ వాళ్లకు మాట్లాడడానికి మాటల్లేవు. నిలబెట్టడానికి నాయకులు లేరు’’ అని హరీశ్ రావు అన్నారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకొస్తే మూడు గంటలు కరెంటు చాలు అంటున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దొంగరాత్రి కరెంటు ఇచ్చిర్రు ఇప్పుడు అది కూడా ఇయ్యరంట 3 గంటలే ఇస్తారంట. మూడు గంటల కరెంటు చాలు అంటే ఏ రైతన్నయినా కాంగ్రెస్ను మరి చూస్తాడా. కరెంటు కోతలతో రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. రైతులను పోలీస్ స్టేషన్లో లైన్లో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలపైన ఆలోచన లేదు కాంగ్రెస్కి. ఈరోజు 70 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. రైతు రుణమాఫీ రద్దు చేయరేమో అనుకొని దింపుడు గల ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు రైతు రుణమాఫీ చేసి బుద్ధి చెప్పారు కెసిఆర్ గారు. రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేసిండు. కాలేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండు 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. ఆగస్టు 15 నుంచి షురూ!
Related News
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యే