HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >India Records Over 40000 Suspected Heatstroke Cases

Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు!

  • By Gopichand Published Date - 07:21 AM, Thu - 20 June 24
  • daily-hunt
Heat Stroke Cases
Heat Stroke Cases

Heat Stroke Cases: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు.. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీని కారణంగా సాధారణ ప్రజలు పలువురు ప్రాణాలు కోల్పోయారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను వేడిగాలులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వేసవి కాలంలో దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ హీట్‌స్ట్రోక్ కేసులు (Heat Stroke Cases) నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర భారతదేశంలో వేడిగాలుల కారణంగా మరణాలు పెరిగాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎండ తీవ్రతకు అనేక మంది చనిపోయారు. ఎండ వేడిమికి పక్షులు చెట్లపైనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. వాయువ్య భారతదేశంలోని రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా వేడి సంబంధిత కారణాలతో ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరుగుతోంది.

మార్చి- జూన్ మధ్య దేశంలో 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు

మార్చి 1- జూన్ 18 మధ్య 40,000 కంటే ఎక్కువ హీట్‌స్ట్రోక్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఈ సమయంలో కనీసం 110 మంది మరణాలు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఉత్తర-పశ్చిమ, తూర్పు భారతదేశంలో హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో మే నెలలో 5200 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో హీట్‌స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైన వారి సంఖ్య 4300 కంటే ఎక్కువగానే ఉంది.

Also Read: Vastu Tips: మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే.. ఈ వాస్తు పరమైన పనులు చేయాల్సిందే.. !

వేడిగాలుల కారణంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు?

ఢిల్లీలో వేడిగాలుల కారణంగా 20 మంది మరణించగా, యూపీలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఘజియాబాద్‌లోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నోయిడాలో 14 మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యూపీలోని 8 జిల్లాల్లో 44 మంది చనిపోయారు. బీహార్‌లో 29 మంది మరణించారని మీడియా నివేదికలలో పేర్కొంది. అయితే కొన్ని రోజుల క్రితం వరకు హీట్‌వేవ్ కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయిన సమాచారం వెల్లడైంది.

NDTV నివేదిక ప్రకారం.. జూన్ 19 వరకు 6000 కంటే ఎక్కువ హీట్‌వేవ్ కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ గురించి పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వడదెబ్బ కారణంగా 16 మంది మరణించారు. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా మరణాల కేసులు నమోదయ్యాయి. అయితే మరణించిన వ్యక్తుల మరణానికి కారణం వేడిగాలినా లేదా మరేదైనా అనేది పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మాత్రమే తెలియనుంది.

We’re now on WhatsApp : Click to Join

ఢిల్లీలో 9 రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృతి

న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం.. జూన్ 11-19 మధ్య ఢిల్లీలో విపరీతమైన వేడి కారణంగా 192 మంది నిరాశ్రయులు మరణించారని నిరాశ్రయుల కోసం పనిచేస్తున్న ఎన్‌జిఓ ‘సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్’ పేర్కొంది. గత 48 గంటల్లో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి అణగారిన సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన 50 మంది మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారా లేదా అనేది పోలీసులు, ఆరోగ్య అధికారులు ధృవీకరించలేదు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Heat Stroke
  • Heat Stroke Cases
  • Heat stroke Death
  • heatwave
  • Heatwave alert

Related News

Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Yamuna River Levels

    Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

  • Bjp

    BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd