Lending Rates: రుణ రేట్లను పెంచిన ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వినియోగదారులపై EMI భారం..!
ఆర్బీఐ వడ్డీ రేటు పెంపును నిలిపివేసిన తర్వాత కూడా కొన్ని బ్యాంకులు రుణ రేట్ల (Lending Rates)ను పెంచుతున్నాయి.
- By Gopichand Published Date - 01:19 PM, Wed - 2 August 23
Lending Rates: గతేడాది మే నుంచి రెపో రేటు పెంపు కారణంగా ప్రజల ఈఎంఐలో పెరుగుదల కనిపిస్తోంది. ఆర్బీఐ వడ్డీ రేటు పెంపును నిలిపివేసిన తర్వాత కూడా కొన్ని బ్యాంకులు రుణ రేట్ల (Lending Rates)ను పెంచుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తాజా పెంపుదల వచ్చింది. ఈ బ్యాంకులు రుణాల ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచాయి. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఏ బ్యాంకు ఎంత పెంచింది..?
ఐసిఐసిఐ బ్యాంక్ నుండి MCLR రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఓవర్నైట్, ఒక నెల MCLR 8.40 శాతం, మూడు నెలల MCLR 8.45 శాతం, ఆరు నెలలు 8.80 శాతం, ఒక సంవత్సరం MCLR 8.90 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని ఎంపిక చేసిన కాలాలకు MCLR పెంచబడింది. ఒక సంవత్సరం MCLR 8.70 శాతం, మూడేళ్ల MCLR 8.90 శాతం. కాగా, ఓవర్ నైట్ 7.95 శాతం, ఒక నెల 8.15 శాతం, మూడు నెలలు 8.30 శాతం, ఆరు నెలలు 8.50 శాతంగా ఉంది.
Also Read: Anasuya Bhardwaj : చేతిలో డ్రింక్ గ్లాస్.. ఎదపై టాటూ అనసూయ హాట్ షో
MCLR అంటే ఏమిటి?
MCLR పూర్తి రూపం ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల మార్జినల్ కాస్ట్. ఖాతాదారులకు బ్యాంకులు రుణాలు ఇచ్చే రేటు ఇది. ఇందులోని మార్పు నేరుగా వినియోగదారుల EMIపై ప్రభావం చూపుతుంది. మే 2022లో RBI వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోను 2.5 శాతం పెంచింది. అయితే గత రెండు మానిటరీ కమిటీ సమావేశాల్లో వడ్డీ రేట్ల పెంపుదల లేదు.
Related News
Business Idea: రోజుకు రూ. 5 వేల వరకు సంపాదన.. చేయాల్సిన పని కూడా సింపులే..!
రైతులు అరటిపంట సాగు చేస్తే దానితో పాటు అరటిపొడి వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ సంపాదనను పెంచుతుంది.