Karvy Fraud : కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది
- By CS Rao Published Date - 03:59 PM, Mon - 24 January 22
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది.బెంగళూరు నుంచి పార్థసారథి ని అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్కు తరలించారు. పార్థసారథి ఇన్వెస్టర్ల షేర్లను కంపెనీ డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసి వాటిపై బ్యాంకు రుణం పొందిన సంగతి తెలిసిందే. ఆ నిధులను తన రియల్ ఎస్టేట్ కంపెనీలోకి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.700 కోట్ల విలువైన నిందితుల షేర్లను గతంలో ఈడీ స్తంభింపజేసింది. నిందితులు రూ.3,000 కోట్ల రుణం పొందారని, అందులో రూ.1,096 కోట్లను 2016 నుంచి 2019 మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీకి బదిలీ చేశారని, విచారణలో ఆ సంస్థ సర్వర్ల నుంచి ఫైల్స్, ఈమెయిల్స్ను డిలీట్ చేసిందని అధికారులు తెలిపారు.ఆరు కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీల లిమిటెడ్ లొకేషన్స్లో కూడా అధికారులు అంతకుముందు సోదాలు నిర్వహించారు. మరియు పార్థసారథికి చెందిన కార్వీ గ్రూపు షేర్లను స్తంభింపజేసింది.