AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ
- By Prasad Published Date - 07:21 PM, Sat - 11 November 23
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించాలన్న ఏపీ సీఐడీ పిటిషన్పై జస్టిస్ కె. కృపాసాగర్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారని, అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారని.. ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి వాదించారు. అసైన్డ్ ల్యాండ్ స్కాం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
Tags
Related News
Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..
ఆమె కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి చంద్రబాబుని సహాయం అడిగారు. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఆసక్తికర కామెంట్స్..