మరో జోషిమఠ్.. కుంగిపోతున్న భూమి..ఎక్కడ ?
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తరహా పరిస్థితి జమ్మూకశ్మీర్లో ఆందోళనలు పెంచుతోంది. డోడా జిల్లాలో భూమి కుంగిపోతోంది. ఇళ్లు, నిర్మాణాలకు భారీ ఎత్తున పగుళ్లు ఏర్పడుతున్నాయి.
- By Nakshatra Published Date - 05:59 PM, Sun - 5 February 23
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తరహా పరిస్థితి జమ్మూకశ్మీర్లో ఆందోళనలు పెంచుతోంది. డోడా జిల్లాలో భూమి కుంగిపోతోంది. ఇళ్లు, నిర్మాణాలకు భారీ ఎత్తున పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఠాఠ్రి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 21 నిర్మాణాలకు పగుళ్లు గుర్తించారు అధికారులు. 20 కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. డోడా జిల్లాలోని నాయి బస్తీలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. డిసెంబర్లో ఓ ఇంటికి పగుళ్లు ఏర్పడగా.. రెండుమూడు రోజుల క్రితం ఆరు భవనాలకు విస్తరించింది. ఇప్పుడీ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓ మసీదు, స్కూల్ సహా 21 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని దాదాపు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని హడలెత్తిపోతున్నారు.
ఠాఠ్రి మునిగిపోతోందంటూ ట్వీట్ చేశారు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్. పరిస్థితి చేయి దాటకుండా తక్షణ చర్యలు చేపట్టాలంటూ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు డోడాలో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. పగుళ్లు రావడానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. రోడ్ల నిర్మాణం, గ్రామానికి పక్కనే నది ప్రవహించడంతోపాటు కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. డోడాలో జోషిమఠ్ తరహా పరిస్థితి లేదని ఎల్జీ మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. పవిత్ర క్షేత్రం జోషిమఠ్లో కొన్నాళ్లుగా భూమి కుంగుతుండటం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇప్పటివరకు 850కిపైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. డేంజర్ జోన్లో ఉన్న భవనాలను ఖాళీ చేయించి అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు . ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్లోనూ ఇదే పరిస్థితి ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. హిమాలయ సానువుల్లో అభివృద్ధి పేరిట చేపడుతున్న విచ్చలవిడి నిర్మాణాలు విపత్తుకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
Tags
Related News
SIA : ఉగ్రవాద సంబంధిత కేసుల్లో కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో SIA దాడులు
జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ కాశ్మీర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) మంగళవారం దాడులు నిర్వహించింది.