Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు మరోసారి తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా నమోదైంది.
- Author : Gopichand
Date : 19-05-2023 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు మరోసారి తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,100కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మే 19, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: CM KCR: నిఖత్ జరీన్కు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,350గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,200 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,500 ఉండగా, ముంబైలో రూ.74,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,100 ఉండగా, కోల్కతాలో రూ.74,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,100 ఉండగా, కేరళలో రూ.78,100గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,100 ఉండగా, విజయవాడలో రూ.78,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.