Gold Price Today: నేడు బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే ధరలివే తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,030గా నమోదైంది.
- By Gopichand Published Date - 08:33 AM, Tue - 18 April 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,030గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.81,600కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (ఏప్రిల్ 18, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,080 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,170గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,490 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,630గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,930 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,020 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,070గా ఉంది.
Also Read: TSRTC : త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం – టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో రూ.78,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, కోల్కతాలో రూ.78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, కేరళలో రూ.81,600గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, విజయవాడలో రూ.81,600 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్ను కొనేస్తోంది.