GATE 2024: త్వరలో గేట్ 2024 నోటిఫికేషన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎగ్జామ్..?!
గేట్ 2024 (GATE 2024) పరీక్షల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. IISc బెంగుళూరు పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది.
- By Gopichand Published Date - 09:34 AM, Sat - 5 August 23
GATE 2024: గేట్ 2024 (GATE 2024) పరీక్షల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. IISc బెంగుళూరు పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని తర్వాత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు 2024 సంవత్సరానికి పరీక్షను నిర్వహిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://gate.iisc.ac.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మీడియా నివేదికల ప్రకారం IISc బెంగళూరు అధికారిక వెబ్సైట్లో ఆగస్టు 24 నుండి గేట్ 2024 రిజిస్ట్రేషన్ను ప్రారంభించవచ్చు. అయితే, ప్రస్తుతం వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు లోడ్ కావడం లేదు. కాబట్టి అభ్యర్థులు పోర్టల్పై నిఘా ఉంచాలని అధికారులు సూచించారు. తద్వారా వారు తాజా అప్డేట్స్ పొందవచ్చు. అభ్యర్థులు మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, దానిని పూర్తిగా చదివి ఆపై దరఖాస్తు చేసుకోండి.
గేట్ పరీక్ష ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించబడుతుంది. దీని కారణంగా 2024 సంవత్సరంలో కూడా గేట్ పరీక్షను 3, 4, 10 మరియు 11 ఫిబ్రవరి 2024 తేదీలలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పరీక్ష, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఖచ్చితమైన తేదీ అధికారిక నోటిఫికేషన్తో విడుదల చేయబడుతుంది. గేట్ 2024 పరీక్షలో అర్హత సాధించిన వారు స్కోర్కార్డ్ మూడేళ్లపాటు చెల్లుబాటవుతుందని గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థి పోర్టల్ను సందర్శించడం కొనసాగించండి.
గేట్ పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలి..?
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్ని సృష్టించండి. దీని తర్వాత ఫారమ్ను ఫీల్ చెసి సమర్పించండి. ఫారమ్ కాపీని డౌన్లోడ్ చేసి మీ వద్ద ఉంచుకోండి.
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�