Road Accident: మహారాష్ట్రలో తెలంగాణ వాసులు మృతి
మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా,
- By Praveen Aluthuru Published Date - 06:48 PM, Sun - 17 September 23
Road Accident: మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పరత్వాడా-చిఖల్దారా రహదారిపై మోతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ బర్గల్ పిటిఐకి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది వాహనంలో ప్రయాణిస్తుండగా, అది లోయలో పడిపోయింది. ఆ సమయంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్దారణకు వచ్చారు. బాధితులు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన చిఖల్దారా వైపు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను అమరావతిలోని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
Also Read: IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్ను ముద్దాడిన భారత్
Related News
Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి
ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి.