Uttar Pradesh: తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారి.. కళ్ళు తెరిచి చూసేసరికి అలా?
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రపంచంవ్యాప్తంగా ఎటువంటి చిన్న ఘటన జరిగిన కూడా అది క్షణాల్లోనే అది వైరల్ అవు
- By Nakshatra Published Date - 06:52 PM, Fri - 16 June 23
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రపంచంవ్యాప్తంగా ఎటువంటి చిన్న ఘటన జరిగిన కూడా అది క్షణాల్లోనే అది వైరల్ అవుతూ ఉంటుంది. అలా నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు, వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని భయానకంగా ఉంటే మరికొన్ని షాకింగ్ గా కూడా ఉంటాయి. మరికొన్ని బాధ కలిగించేవిగా కూడా ఉంటాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఒక చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బాల్కనీలో నిద్రిస్తుండగా కళ్ళు తెరిచి చూసేసరికి తల్లిదండ్రులకు షాక్ తగిలినట్టు అయింది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో తల్లిదండ్రులు నిద్రిస్తోన్న సమయంలో ఈ ఘోరం జరిగిపోయింది. నోయిడాలోని సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీలోని ఎనిమిదో అంతస్తులోని ఫ్లాట్లో ఒక కుటుంబం నివసిస్తోంది. తాజాగా నేడు అనగా శుక్రవారం తెల్లవారుజామున 5.45 గంటలకు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా వారి ఐదేళ్ల పిల్లాడు మాత్రం మేల్కొన్నాడు.
ఇంటిలోని మిగతా కుటుంబసభ్యుల కంటే ముందుగానే పిల్లాడు నిద్రలేచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇల్లంతా తిరిగాడు. బాల్కనీలోకి వెళ్లి గ్రిల్స్ ఎక్కడంతో అక్కడి నుంచి జారిపడిపోయాడు. అక్కడ మొక్కల పెంపకం కోసం ఏర్పాటు చేసిన ప్లాంటర్స్ ఉండటంతో బాల్కనీ గ్రిల్స్ వరకు చేరుకోగలిగాడు. బాల్కనీలో నుంచి ఒక్కసారిగా ఆ చిన్నారి పడిపోవడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
Related News
CM Yogi Adityanath: సైబర్ నేరగాళ్లకు చమటలే ఇక.. 57 కొత్త సైబర్ పోలీస్ స్టేషన్లు
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సైబర్ నేరగాళ్ళను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్క్రైమ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.