Neha Hiremath Murder: నేహా హిరేమత్ పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు,.. 14 కత్తి పోట్లు
కర్ణాటకలోని హుబ్లీలో సంచలనం సృష్టించిన నేహా హిరేమత్ హత్య పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్ చూసి డాక్టర్లే షాకయ్యారట. ఫయాజ్ నేహా హిరేమత్ ను ఎంత దారుణంగా హత్య చేశాడో రిపోర్టులో స్పష్టమైంది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఆమె 14 సార్లు కత్తిపోట్లకు గురైందని పోలీసు వర్గాలు ధృవీకరించాయి.
- By Praveen Aluthuru Published Date - 04:59 PM, Mon - 22 April 24
Neha Hiremath Murder: కర్ణాటకలోని హుబ్లీలో సంచలనం సృష్టించిన నేహా హిరేమత్ హత్య పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్ చూసి డాక్టర్లే షాకయ్యారట. ఫయాజ్ నేహా హిరేమత్ ను ఎంత దారుణంగా హత్య చేశాడో రిపోర్టులో స్పష్టమైంది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఆమె 14 సార్లు కత్తిపోట్లకు గురైందని పోలీసు వర్గాలు ధృవీకరించాయి.
పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు:
నిందితుడు ఫయాజ్ నేహా ఛాతీపై, మెడపై కత్తితో పొడిచి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. పోస్ట్మార్టం నివేదికను ఉటంకిస్తూ నేహా మెడపై చాలాసార్లు కత్తితో దాడి జరిగింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో నేహా అక్కడికక్కడే మరణించింది. ఫయాజ్ మొదట నేహా ఛాతీ మరియు కడుపుపై దాడి చేశాడని, అయితే ఆమె పడిపోయిన వెంటనే ఆమె శరీరమంతా కత్తితో దాడి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు ఆమె గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించాడు.
We’re now on WhatsApp. Click to Join
నేహా హిరేమత్ హుబ్లీలోని బీవీబీ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఫయాజ్, నేహా ఇద్దరూ కలిసి చదువుకున్నారు . దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. బీసీఏ తర్వాత ఫయాజ్ చదువు ఆపేశాడు. నేహా తండ్రి హుబ్లీలో కాంగ్రెస్ కౌన్సిలర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా అతను ఫయాజ్ పై ఓ ఆరోపణ చేశాడు. నిందితుడు ఫయాజ్ తన కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయాలని చాలా ఏళ్లుగా భావిస్తున్నాడని తెలిపాడు. ఈ నెపంతో ప్రేమ మారుతో నా కుమార్తెను కిరాతంగా హత్య చేశాడని చెప్పాడు.
Also Read: Obesity: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి అసలు కారణమిదే.. అవేంటో తెలుసా
Related News
Relationship: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!
Relationship: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఈ అక్రమ సంబంధానికి మరో వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం, వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజ