Sukma Encounter: సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సలైట్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా (Sukma) జిల్లాలోని డబ్బమార్క క్యాంపు వద్ద భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగినట్లు సమాచారం. ఎన్కౌంటర్లో ఐదు నుంచి ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 10:43 AM, Thu - 9 March 23

ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా (Sukma) జిల్లాలోని డబ్బమార్క క్యాంపు వద్ద భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగినట్లు సమాచారం. ఎన్కౌంటర్లో ఐదు నుంచి ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు తెలుస్తోంది. కోబ్రా, STF, CRPF సంయుక్త బృందం గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్బామార్క్ క్యాంపు నుండి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం సక్లెర్ వైపు వెళ్ళింది. ఈ క్రమంలో ఉదయం ఏడు గంటలకు భద్రతా బలగాల సంయుక్త బృందానికి, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల బృందం ప్రతీకారం తీర్చుకుంది. ఈ కాల్పుల్లో 5-6 మంది నక్సలైట్లు గాయపడ్డారు. గాయపడిన నక్సలైట్లు పారిపోయారు.
ఉమ్మడి బృందం భారీ మొత్తంలో BGL, ఇతర నక్సల్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతానికి ఎన్కౌంటర్ ముగిసింది. భద్రతా బలగాలు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కోబ్రా, STF, CRPF చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు.
Also Read: Murder : ఢిల్లీలో దారుణం.. సీఎన్జీ పంప్లో సేల్స్మేన్ని కొట్టి చంపిన దుండగులు
ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కోబ్రా జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బీజీఎల్ పేలుడు వల్ల స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా ఏ అధికారి ధృవీకరించలేదు. గాయపడిన వారంతా అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related News

Five Dead: ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో మంటలు, పొగలు రావడంతో ఐదుగురు కూలీలు (Five Dead) చనిపోయారు. ఈ ఘటన కుంజ్ బిహారీ గఢ్ఫుజార్ బస్నాలోని ఇటుక బట్టీలో చోటుచేసుకుంది.