Earthquake: బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం
సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ఎస్సి) తెలిపింది
- By Praveen Aluthuru Published Date - 09:47 AM, Mon - 11 September 23
Earthquake: సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ఎస్సి) తెలిపింది. భూ ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంప సంఘటన కేంద్రం అక్షాంశం 9.75 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 84.12 డిగ్రీల తూర్పున ఉంది. సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు శనివారం త్రిపురలోని ధర్మనగర్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 43 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం నమోదైంది.
Also Read: Free Heart Surgeries : నిమ్స్ లో ఫ్రీగా పిల్లలకు హార్ట్ సర్జరీలు.. ఎప్పటి నుంచి అంటే ?
Related News
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.