Vijayawada : దుర్గగుడిలో భక్తురాలి ఉంగరం కోట్టేసిన ఉద్యోగి
విజయవాడ దుర్గగుడిలో భక్తురాలి బంగారం చోరీ జరిగింది. ఉయ్యూరు నుంచి దుర్గ గుడి కి వచ్చిన ఓ భక్తురాలు కొబ్బరికాయ
- By Prasad Published Date - 07:16 AM, Sat - 24 December 22
విజయవాడ దుర్గగుడిలో భక్తురాలి బంగారం చోరీ జరిగింది. ఉయ్యూరు నుంచి దుర్గ గుడి కి వచ్చిన ఓ భక్తురాలు కొబ్బరికాయ కొట్టే సమయంలో ఆమె ఉంగరం కింద పడిపోయింది. అయితే దానిని గమనించిన కాంట్రాక్టు ఉద్యోగి ఉంగరం తీసి తన జోబులో వేసుకున్నాడు. ఉంగరం పడిపోయిన విషయాన్ని బాధితురాలు గమనించి అక్కడ ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి అడగగా మాకు ఏమీ తెలియదు అంటూ బుకాయించాడు. దీంతో చేసేదేమీ లేక దుర్గగుడి అవుట్ పోస్ట్ లో ఉన్న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొబ్బరికాయలు కొట్టే ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కాంట్రాక్టు ఉద్యోగి ఉంగరాన్ని జోబులో వేసుకున్నట్లుగా చూసి అదుపులోనికి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
Related News
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.