DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నేడు డీఏ పెంపుపై క్లారిటీ..!
నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
- By Gopichand Published Date - 08:53 AM, Wed - 18 October 23
DA Hike Announcement: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర ఉద్యోగులకు కూడా శుభవార్త రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కరువు భత్యం 42 శాతం నుంచి 46 శాతానికి పెరుగుతుంది.
ఈ పెంపు జూలై 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది. నవంబర్ నెల జీతం వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు జూలై నుంచి అక్టోబర్ వరకు బకాయిలు కూడా అందుతాయి. ఈ ప్రకటన ద్వారా 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA) సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్నారు. ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనం పొందుతారు.
Also Read: Gold- Silver Rates: గోల్డ్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన ధరలు..!
We’re now on WhatsApp. Click to Join.
జీతంపై 4 శాతం డీఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుంది?
కనీస మూల వేతనం రూ.18,000 అనుకుందాం. ప్రస్తుతం ఉన్న 42 శాతం డీఏ ప్రకారం రూ.7,560 పెరుగుతుంది. డీఏను 4 శాతం నుంచి 46 శాతానికి పెంచితే నెలవారీ పెంపు రూ.8,280 అవుతుంది. ఇది కాకుండా ప్రయాణ భత్యంపై కూడా DA అందుబాటులో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ పే స్కేల్లోని ఉద్యోగి రూ. 8,640 లాభాన్ని పొందవచ్చు. అదే సమయంలో గరిష్ట వేతన స్కేల్ రూ.56,900 ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం 42 శాతం డీఏ ప్రయోజనాన్ని పొందుతున్నారు. నెలవారీ డియర్నెస్ అలవెన్స్ రూ. 23,898. డీఏ 46 శాతం అయితే ఈ మొత్తం రూ.26,174గా అంచనా వేయబడింది.
Related News
Income Tax Return Filing: ITR ఫైల్ చేయడానికి జూన్ 15 వరకు ఆగాల్సిందే..!
ఆదాయపు పన్ను శాఖ తన పోర్టల్లో ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి ఐటీఆర్ ఫారమ్లను తెరిచింది.