HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Control Room Set Up For Saudi Bus Accident Victims

Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.

  • Author : Hashtag U Date : 17-11-2025 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saudi Arabia Bus Tragedy
Saudi Arabia Bus Tragedy

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.

సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి.. ఏకంగా 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది భారతీయ యాత్రికులేనని.. ఇందులోనూ హైదరాబాద్‌కు చెందినవారు అధికంగా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (సౌదీ కాలమానం ప్రకారం) మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. దీంతో 42 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాలకు చెందిన సుమారు 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలోనూ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు తెలిసింది.

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు +91 79979 59754, +91 99129 19545 ద్వారా సంప్రదించాలని కోరారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో తెలంగాణ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీ ద్వారా ప్రయాణించారో తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • hyderabad
  • Saudi Arabia
  • Saudi Arabia Tragedy

Related News

Motorists Queue For Petrol

యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి

  • Revanth Reddy

    తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Bachupally Fire Accident

    హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

  • China Faces Significant Losses from Trump's Attack in Iran

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

  • Indian Expats

    గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!

Latest News

  • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

  • ఇరాన్ యుద్ధ నౌక‌పై అమెరికా దాడి.. 28 మంది మృతి, 100 మందికిపైగా గ‌ల్లంతు!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన తొలి జ‌ట్టు ఇదే!

  • ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

  • భార‌త మార్కెట్‌లో అత్యంత చౌకైన బైక్ ఇదే!

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd