CM Jagan : రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ యూనిట్ ప్రారంభించనున్న సీఎం
రేపు కడప జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి
- By Prasad Published Date - 08:21 AM, Wed - 8 November 23
రేపు కడప జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. APCARL ఆవరణలో ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ యూనిట్తో పాటు పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో శ్రీకృష్ణ భగవానుడి ఆలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మ్యూజికల్ ఫౌంటెన్, జిప్లైన్ను సీఎం ప్రారంభిస్తారు. హత్యకు గురైన వైఎస్ రాజారెడ్డి విగ్రహాన్నిపులివెందులలోని శిల్పారామం ఆవరణలో ఆవిష్కరించనున్నారు. అనంతరం ఐఐఐటీ ఇడుపులపాయలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. నవంబర్ 9వ తేదీన రాత్రికి ఇడుపులపాయలో జగన్ మోహన్ రెడ్డి బస చేయనున్నారు. పీకాక్ పార్క్ ఆవరణలో కడప జిల్లా వైఎస్ఆర్సీ నేతలతో ఆయన సమావేశం కానున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థకౌసల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Related News
AP Politics : డిజిటల్ మీడియా ప్రకటనల్లో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ వెనుకబడిందా.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియాలో పార్టీని ప్రచారం చేయడం దాని ప్రధాన ప్రత్యర్థి – ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కంటే వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.