CM Jagan : నేడు కర్నూల్, నంద్యాలలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన
- By Prasad Published Date - 08:10 AM, Tue - 19 September 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా దోనె, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీరు నింపే పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.కృష్ణగిరి మండలం ఆలంకొండకు చేరుకుని హంద్రీనీవా నీటిని చెరువులకు ఎత్తిపోసే పంప్హౌస్ మోటార్లను ఆన్ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు (మంగళవారం) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ సంప్రదాయంతో అర్చకులు స్వాగతం పలికి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు.పూజానంతరం రంగనాయకుల మండపంలో సీఎం జగన్మోహన్రెడ్డి వేదాశీర్వచనం స్వీకరించారు. సీఎం జగన్కు టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు
Tags
Related News
AP Politics : డిజిటల్ మీడియా ప్రకటనల్లో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ వెనుకబడిందా.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియాలో పార్టీని ప్రచారం చేయడం దాని ప్రధాన ప్రత్యర్థి – ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కంటే వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.