Gold- Silver: భారీగా పెరిగిన ధరలు.. దేశ వ్యాప్తంగా రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు భారీగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:39 AM, Sun - 29 October 23
Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,620గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (అక్టోబర్ 29, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Israel Hamas War: భయంకరంగా మారిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,770గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,620 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,620గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,620గా ఉంది.
We’re now on WhatsApp : Click to Join
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600 ఉండగా, ముంబైలో రూ.74,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, కోల్కతాలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, కేరళలో రూ.77,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 180 మంది ప్రయాణికులు సేఫ్
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో గురువారం (మే 16) పెను ప్రమాదం తప్పింది.