India vs Pakistan: ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు.. కుమ్మేసిన కోహ్లీ..!
T20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది.
- By Gopichand Published Date - 05:41 PM, Sun - 23 October 22
T20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో కోహ్లీ (82 నాటౌట్), హార్దిక్ పాండ్య (40) పరుగులతో రాణించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ పోరులో చివరికి విజయం భారత్ జట్టును వరించింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగ్గిన చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత బౌలర్లు అదరగొట్టారు. పాకిస్థాన్ను 159 పరుగులకే కట్టడి చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్శర్మ అంచనాలకు తగ్గట్టే భారత బౌలర్లు తమ సత్తా చూపారు. దింతో పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలింగ్ లో అర్షదీప్ 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, పాండ్యా 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, షమీ చెరో 1 వికెట్ తీశారు.
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.