HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Changes In The Timings Of Single Day Schools In Ap

Minister Lokesh : ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు

స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

  • Author : Latha Suma Date : 18-03-2025 - 12:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
schools closed
schools closed

Minister Lokesh : వేసవి నేపథ్యంలో ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ఒక్కపూట బడుల సమయ వేళల్లో మార్పులు చేయాలని మంత్రి నారా లోకేష్ అదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడులు మధ్యాహ్నం 1. 30 లకు ప్రారంభించాలని మంత్రి తన ఆదేశాల్లో తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 12. 45 వరకు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిపూట బడులు మధ్యాహ్నం 1.15కు ప్రారంభం అవుతున్నాయి.

Read Also: Telangana Assembly : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ

కాగా, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ లు ఉన్న స్కూళ్లలో అధికారులు మధ్యాహ్నం పూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మొదలవుతుండగా మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష పూర్తవుతోంది. ఆ తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి పరీక్షా కేంద్రం నుంచి పంపిస్తున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు.

Read Also: Hydraa : హైడ్రా పేరుతో వసూళ్ల దందా – కేటీఆర్ ట్వీట్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • exam centers
  • Half day schools
  • Minister Lokesh
  • School timings
  • Tenth exam papers

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Yarraji Jyoti

    యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

  • Jal Jevaan

    జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

  • Budget 2026 Amaravati Bill

    బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

  • Dialysis Center

    ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్

Latest News

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd