CISF Raising Day : సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ వార్షిక రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- By Prasad Published Date - 08:27 AM, Sun - 12 March 23
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ వార్షిక రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్ననే హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ రోజు(ఆదివారం) ఉదయం హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో ఈ కార్యక్రమం జరగనుంది. విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ నేతలు హోంమంత్రికి స్వాగతం పలికారు. భారతదేశ అంతర్గత భద్రతకు మూలస్తంభాలలో సిఐఎస్ఎఫ్ ఒకటని కేంద్ర హోమంత్రి అమిత్షా ట్వీట్ చేశారు. ఈ పరేడ్ ప్రతి ఏడాది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్లోని సిఐఎస్ఎఫ్ మైదానంలో జరిగేది. ఈ సారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.