Viveka Murder Case: వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు కీలక దశలో ఉండగా వివేకానందరెడ్డి పీఏ కష్ణారెడ్డిపై సీబీఐ ఫోకస్ చేసింది. నిజానికి ఇప్పటికే కృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది
- Author : Praveen Aluthuru
Date : 27-04-2023 - 2:15 IST
Published By : Hashtagu Telugu Desk
Viveka Murder Case:వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు కీలక దశలో ఉండగా వివేకానందరెడ్డి పీఏ కష్ణారెడ్డిపై సీబీఐ ఫోకస్ చేసింది. నిజానికి ఇప్పటికే కృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది. ఈ కేసులో ఆయన గతంలోనే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి బెయిల్ పై ఉన్నారు. కాగా ఈ రోజు గురువారం సీబీఐ మరోసారి కృష్ణరెడ్డిని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో కీలక సమాచారం కోసం కృష్ణారెడ్డి ఇచ్చే సమాచారం కీలకంగా భావిస్తుంది సీబీఐ. అందులో భాగంగా కడప నుంచి పులివెందులకు వచ్చింది. తొలుత కృష్ణారెడ్డికి ఇంటికి వెళ్లిన సీబీఐ కొంతసేపు ఎదురుచూసింది. తర్వాత కృష్ణారెడ్డిని సీబీఐ పలు విధాలుగా విచారించింది. దీంతో పులివెందులలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన అరెస్ట్ ఖాయమంటూ లీకులు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. పులివెందులలో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో సొంత వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ విచారించింది. అయితే ఈ కేసులో భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read More: BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు ఇవే.. ప్రవేశపెట్టిన కేటీఆర్!