Mumbai Indians Play Offs: ముంబైకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్.
- By Hashtag U Published Date - 10:33 AM, Fri - 22 April 22
ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా తిరుగులేని రికార్డు ఉన్న రోహిత్ సేన ఈసారి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆ జట్టు ఏడో మ్యాచ్ లోనైనా గెలుపు బోణీ చేయలేకపోయింది. దీంతో ఈ సీజన్ ప్లే ఆఫ్ ఛాన్స్ దాదాపుగా చేజారిపోయినట్టే. నిజానికి ఇటువంటి పరిస్థితినీ ముంబై గతంలో కూడా ఎదిర్కొంది. అయితే అప్పుడు వరుసగా నాలుగు లేదా అయిదు మ్యాచ్ లు ఓడిన తర్వాత అద్భుతంగా పుంజుకుని ప్లే ఆఫ్ కు వచ్చింది. ఈసారి మాత్రం వరుసగా ఏడు మ్యాచ్ లు ఓడిపోవడం అనూహ్యమే.
ఐపీఎల్ లో ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టుకయినా 16 పాయింట్లు కావాలి. ఒకవేళ 14 పాయింట్లు సాధించినా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ , ఇతర జట్ల మ్యాచ్ ల ఫలితాలు వంటి వాటిపై ఆధారపడి వుంటుంది. ఇప్పటికే 7 మ్యాచ్ ల్లో ఓడిన ముంబై 16 పాయింట్లు సాధించే అవకాశం లేదు. అయితే మిగిలిన ఏడు మ్యాచ్ లు అన్నింట్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. మిగిలిన అన్ని మ్యాచ్ లో మంచి రన్ రేట్ తో గెలవడం చాలా ముఖ్యం. అలా రన్ రేట్ తో గెలిస్తే , మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసి వస్తే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం ముంబై ఆటతీరు చూసిన తర్వాత ఆ జట్టు వరుసగా ఏడు మ్యాచ్ లు గెలుస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. మొదటి ఏడు మ్యాచ్ ల్లో ఒక్కటీ కూడా గెలవని టీమ్ మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలుస్తుందని అనుకోవడం తెలివి తక్కువతనం అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. తుది జట్టులో తిలక్ వర్మ, బూమ్రా తప్పిస్తే ఏ ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలవడం కష్టమే. ప్లే ఆఫ్ గురించి ఆలోచించడం మానేసి కనీసం పరువు కాపాడుకునేందుకు అయిన మిగిలిన మ్యాచ్ లు గెలవాలని రోహిత్ సేనకు మాజీలు సూచిస్తున్నారు.
Related News
MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్.. సన్రైజర్స్పై రివేంజ్ తీర్చుకున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.