Belagavi Express: బెలగావి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రైలులో తనిఖీ చేపట్టారు.
- By Gopichand Published Date - 08:51 AM, Thu - 23 February 23
సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రైలులో తనిఖీ చేపట్టారు. బెలగావి ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లాల్సిన ఈ రైల్లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి 9.30 గంటలకు ఫోను రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాత్రి 11.15 గంటల వరకు పరిశీలించి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Tajikistan: తజికిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు
వాస్తవానికి ఈనెంబర్ 07335/36 గల రైలు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామస్థుడు బాలరాజు ఆటో డ్రైవర్. ఓ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ రైలులో బాంబు ఉందంటూ మాట్లాడుకుంటుండగా బాలరాజు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.35 గంటల సమయంలో రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లింది. బాలరాజును విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Related News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.