LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు
- By Balu J Published Date - 06:00 PM, Sun - 18 February 24
LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడుతున్నారు.మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు ఎన్నికల ప్రచార రథాలను పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తిప్పుతున్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే పలువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని మురిపించేలా కార్యక్రమాలను చేపట్టడంపై ద్వితీయ శ్రేణి నాయకులు,కేడర్ ను అయోమయం లో ముంచేస్తుంది.
ఇటీవల ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో లోక్ సభ అభ్యర్థుల విషయంపై రాష్ట్రా ఎన్నికల కమిటీ సభ్యులు డీకే అరుణ, మురళీధర్ రావు ,బండి సంజయ్,ఈటల రాజేందర్ ,గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి సంస్థ గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం దరఖాస్తులను పరిశీలించగా…….ఇందులో మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు నేతలు గ్రహించారు.
ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగా పోటీ పడుతున్నారు.తనకున్న రాజకీయ అనుభవం,ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి టికెట్ తనకే ఇవ్వాలని అగ్రనేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఇదే సీటును బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
Tags
Related News
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యే