HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bcci Hikes Cash Prize For Domestic Tournaments

BCCI: ప్రైజ్మనీ భారీగా పెంచిన బీసీసీఐ

ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది

  • Author : Praveen Aluthuru Date : 17-04-2023 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bcci 1
Bcci 1

BCCI: ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఒక రకంగా మనీ పవర్‌ ఏంటో క్రికెట్‌ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐదే. ఇక ఐపీఎల్ టోర్నీ పరిచయం చేసి ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ పెద్దన్న పాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీ ద్వారా బీసీసీఐ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. వేలంలో ఆటగాళ్ల ప్రతిభకు తగ్గ పారితోషికాలు ఇస్తూనే మరోవైపు ప్రసారాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటుంది. అయితే తాజాగా ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది.

బీసీసీఐ పెంచిన ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి:

* రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు.
* ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ.3 కోట్లు.
* రంజీ ట్రోఫీ సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. 1 కోటి. గతంలో రూ.50 లక్షలుగా ఇచ్చేవారు. ప్రస్తుతం కోటికి పెంచారు. .
* అదేవిధంగా దులీప్ ట్రోఫీ విజేతకు రూ.1 కోటి.
* రన్నరప్ కు రూ.50 లక్షలు. గతంలో అంటే నిన్నటివరకు దులీప్ ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇచ్చేవారు.
* విజయ్ హజారే ట్రోఫీలో విజేతకు 30 లక్షలు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 1 కోటికి పెంచారు.
* రన్నరప్ కు అందించే 15 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.
* దేవధర్ ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా… ఇకపై విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు చెల్లిస్తారు.
* ప్రైజ్ మనీ పెంచిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతలకు రూ.80 లక్షలు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.40 లక్షలు అందించనున్నారు. ఇప్పటివరకు ఫైనల్ విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలుగా ఉండేది.
* ఇక సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలుగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ టోర్నీ విజేతకు రూ.6 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇచ్చారు.
* సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని భారీగా పెంచారు. విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలుగా చేశారు.

ఆటగాళ్లకు ప్రైజ్ మనీ పెంచడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్టే అవుతుంది. తాజాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రపంచ క్రికెట్ బోర్డులు సైతం ఖంగు తింటున్నారు. బీసీసీఐ పెంచిన పారితోషికం అలాంటిది మరి.

Read More: Anant Ambani & Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రేమకథ మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • domestic tournaments
  • Increased Prize Money
  • IPL
  • jay shah
  • Prize Money

Related News

Gautam Gambhir

టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!

శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఆయన సుదీర్ఘ కాలం జట్టులో ఉంటారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల సమక్షంలో జట్టును ప్రకటించినప్పుడు గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • t20 world cup 2026 team india squad

    వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • Suryakumar Yadav

    సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

  • India vs SA

    భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

  • Shashi Tharoor

    లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

Latest News

  • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

  • కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

  • వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!

  • మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

  • తండ్రి కాబోతున్న నాగచైతన్య , నిజమేనా ?

Trending News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd