HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bcci Hikes Cash Prize For Domestic Tournaments

BCCI: ప్రైజ్మనీ భారీగా పెంచిన బీసీసీఐ

ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది

  • Author : Vamsi Chowdary Korata Date : 17-04-2023 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bcci 1
Bcci 1

BCCI: ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఒక రకంగా మనీ పవర్‌ ఏంటో క్రికెట్‌ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐదే. ఇక ఐపీఎల్ టోర్నీ పరిచయం చేసి ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ పెద్దన్న పాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీ ద్వారా బీసీసీఐ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. వేలంలో ఆటగాళ్ల ప్రతిభకు తగ్గ పారితోషికాలు ఇస్తూనే మరోవైపు ప్రసారాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటుంది. అయితే తాజాగా ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది.

బీసీసీఐ పెంచిన ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి:

* రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు.
* ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ.3 కోట్లు.
* రంజీ ట్రోఫీ సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. 1 కోటి. గతంలో రూ.50 లక్షలుగా ఇచ్చేవారు. ప్రస్తుతం కోటికి పెంచారు. .
* అదేవిధంగా దులీప్ ట్రోఫీ విజేతకు రూ.1 కోటి.
* రన్నరప్ కు రూ.50 లక్షలు. గతంలో అంటే నిన్నటివరకు దులీప్ ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇచ్చేవారు.
* విజయ్ హజారే ట్రోఫీలో విజేతకు 30 లక్షలు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 1 కోటికి పెంచారు.
* రన్నరప్ కు అందించే 15 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.
* దేవధర్ ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా… ఇకపై విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు చెల్లిస్తారు.
* ప్రైజ్ మనీ పెంచిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతలకు రూ.80 లక్షలు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.40 లక్షలు అందించనున్నారు. ఇప్పటివరకు ఫైనల్ విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలుగా ఉండేది.
* ఇక సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలుగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ టోర్నీ విజేతకు రూ.6 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇచ్చారు.
* సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని భారీగా పెంచారు. విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలుగా చేశారు.

ఆటగాళ్లకు ప్రైజ్ మనీ పెంచడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్టే అవుతుంది. తాజాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రపంచ క్రికెట్ బోర్డులు సైతం ఖంగు తింటున్నారు. బీసీసీఐ పెంచిన పారితోషికం అలాంటిది మరి.

Read More: Anant Ambani & Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రేమకథ మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • domestic tournaments
  • Increased Prize Money
  • IPL
  • jay shah
  • Prize Money

Related News

India vs. Sri Lanka Test series schedule...

IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

డబ్ల్యూటీసీ (2025-27) సైకిల్‌లో భాగంగా శ్రీలంక గడ్డపై భారత్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను లంక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో కచ్

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd