Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) స్టింగ్ ఆపరేషన్ కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ భారత జ, ఆటగాళ్లకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు.
- By Gopichand Published Date - 11:21 AM, Fri - 17 February 23
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) స్టింగ్ ఆపరేషన్ కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ భారత జ, ఆటగాళ్లకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. ఆ తర్వాత నిత్యం వివాదాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిని వదిలేశాడు. చేతన్ శర్మ తన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపగా, అతని రాజీనామాను ఆమోదించారు.
టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి వీడియోలో అతను టీమ్ ఇండియా ఆటగాళ్ల గురించి అనేక విషయాలను బహిర్గతం చేశాడు. దానిపై వివాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 17) చేతన్ శర్మ తన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపగా, అతను దానిని ఆమోదించినట్లు తెలిసింది.
చేతన్ శర్మ 2023 జనవరి 7న మరోసారి బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా మారారు. ఇది అతని రెండవ టర్మ్. కానీ ఈసారి అతని పదవీకాలం 40 రోజుల్లో ముగిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చేతన్ శర్మ రెండు టర్మ్ లలోనూ తన పదవిని కోల్పోయాడు. గత టర్మ్లో BCCI T20 ప్రపంచ కప్లో పేలవమైన ప్రదర్శనతో మొత్తం కమిటీని తొలగించింది బీసీసీఐ.
Also Read: Letter Delivered After 100 Years: 100 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన లెటర్
మంగళవారం బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో అతను ఆటగాళ్ల ఎంపిక, పద్ధతులు, ఫిట్నెస్కు సంబంధించిన అనేక విషయాలను బహిర్గతం చేశాడు. చేతన్ శర్మ.. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై సంచలన ఆరోపణలు చేశాడు. కోచ్లు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లిలతో సంభాషణలను కూడా బయటపెట్టాడు. 80 నుంచి 85 శాతం ఫిట్గా ఉన్నప్పటికీ, పోటీ క్రికెట్లోకి త్వరగా తిరిగి రావడానికి ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని శర్మ ఆరోపించారు.
అతనికి, టీమ్ మేనేజ్మెంట్ మధ్య విభేదాలు ఉన్నాయని కూడా ఆరోపించాడు. చేతన్ శర్మ ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు, దాని కారణంగా వివాదం జరిగింది. ఈ వీడియో తర్వాతే చేతన్ శర్మ వార్తల్లో నిలిచాడు. చేతన్ శర్మతో పాటు శివ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్లకు బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
Related News
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.