Karnataka : సీఎం పదవికి రాజీనామా చేసిన బసవరాజ్ బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం
- By Prasad Published Date - 07:37 AM, Sun - 14 May 23
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం రాజీనామా సమర్పించారు. బీజేపీ సీనియర్ నేతలతో కలిసి రాజ్భవన్లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు బొమ్మై తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇకపై ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా పని చేస్తానని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లు తగ్గాయని తెలిపారు.ఈ ఓటమి ఆత్మపరిశీలనకు, తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించిన ఆయన, రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపబోవని ప్రకటించారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.